రోహిత్ షాట్‌తో సచిన్ గుర్తొచ్చాడు!

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 03:11 PM

రోహిత్ షాట్‌తో సచిన్ గుర్తొచ్చాడు!

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ వన్‌సైడ్ విక్టరీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆనందం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అగ్రశ్రేణి జట్టయిన ఆసీస్‌ను ఈ మ్యాచ్‌లో చితక్కొట్టారని, రోహిత్ శర్మ రూత్‌లెస్‌గా వ్యవహరించి సెంచరీ బాదడని ప్రశంసల వర్షం కురిపించాడు. మూడో వన్డేలో గెలుపొందటంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో అక్తర్.. భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. చిన్నస్వామి స్టేడియంలో భారత్.. ఆసీస్‌పై నిర్దయగా వ్యవహరించదని విశ్లేషించాడు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లను భారత్ ఆడుకుందని, విధ్వంసకరమైన ఆటతీరుతో బెంబేలెత్తించిందని వ్యాఖ్యానించాడు. ఇక రోహిత్ శర్మ అయితే నిర్దయగా వ్యవహరించాడని, ఎలాంటి బంతినైనా స్టాండ్స్‌లోకి పంపడమే ధ్యేయంగా ఆడాడని కితాబిచ్చాడు. అతని షాట్లను చూస్తుంటే తనకు సచిన్ గుర్తుకు వచ్చాడని కొనియాడాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి పిచ్‌పై రోహిత్‌కు పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయాడని అక్తర్ కితాబిచ్చాడు. భారీ షాట్లను అలవోకగా ఆడాడని, బౌలర్లను ఉతికారేశాడని ప్రశంసించాడు. తొలుత జంపాపై పంజా వేసిన హిట్‌మ్యాన్.. స్టార్క్ వరకు అందరినీ తుత్తునీయలు చేశాడని తెలిపాడు. ఇక రోహిత్ ఆడిన ఒక కట్ షాట్ తనకు లెజెండరీ సచిన్ టెండూల్కర్‌ను గుర్తుకు తెచ్చిందని పేర్కొన్నాడు. మొత్తానికి మూడో వన్డేలో ఆసీస్‌ను చితక్కొట్టేశారని అక్తర వ్యాఖ్యానించాడు.






Untitled Document
Advertisements