దారుణం .. పెళ్ళైన మరుసటి రోజే వివాహిత గ్యాంగ్ రేప్ ..

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 11:57 AM

గత శుక్రవారం వివాహమైన నవ వధువు, కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టగా, ఆ మరుసటి రోజే, ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మూడు రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని థానా దేహాడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతానికి చెందిన యువకుడితో, 17వ తేదీన యువతికి వివాహం జరుగగా, ఆపై ఆమె అత్తారింట్లో కాలుమోపింది. మరుసటి రోజే ఆమె కనిపించకుండా పోగా, ఆమె కోసం వెతికిన బంధుమిత్రులు, పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో ఆదివారం నాడు హాపూర్ లోని ఓ బ్యాంకు శాఖ సమీపంలో నవ వధువు అపస్మారక స్థితిలో కనిపించింది. ఇంట్లోని ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన దారుణ ఘటనతో యువతి షాక్ కు గురై, ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. అత్యాచారంపై కేసు నమోదు చేశామని, నిందితులను గాలించేందుకు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు వెల్లడించారు.





Untitled Document
Advertisements