మంచిర్యాల జిల్లాలో మిస్సింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వివిధ కారణాలతో అనేకమంది ఇంటి నుంచి పారిపోతుండగా, కొంతమంది కిడ్నాప్కు గురై కనిపించకుండా పోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో మరో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. నస్పూర్ లోని అంబేద్కర్ కాలనీకి చెందిన కొయ్యల శ్రీనివాస్(38) ఈ నెల 19న అదృశ్యమయ్యాడు. శ్రీనివాస్ నగర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం ప్రచారంలో పాల్గొని రాత్రి పది గంటలు దాటినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రాత్రివేళ బంధువులు, స్నేహితులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. చివరికి అతని బంధువులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే శ్రీనివాస్ కు మతిస్థిమితం లేదు అని కుటుంబీకులు వెల్లడించారు. గత కొంతకాలంగా మతిస్థిమితం లేకపోవడంతో అతను ఇంట్లోనే ఉండేవాడు అని ఎన్నికల ప్రచారం సందర్భంగా బయటికి వెళ్లి తిరిగి రాలేదని అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అతనుకేవలం చుట్టుపక్కలో ఉన్న పట్టణాలు (మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్) లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అతని ఆచూకి ఎవరికైనా దొరికితే తమకు చెప్పవలసిందిగా బంధువులు కోరుతూ వారి ఫోన్ నెంబర్లను ఇచ్చారు.
అతని ఆచూకి లభిస్తే ఈ నెంబర్లకి ఫోన్ చేసి తెలియజేయండి:
*9989595146
*9573416604
*8790052431