బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే కొత్త సర్వీసులు!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 03:53 PM

బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే కొత్త సర్వీసులు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ ఉన్నతాధికారులను ఉతికారేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్లతో కలిసి ముందుకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. బ్రాంచ్ స్థాయిలోని బ్యాంక్ అధికారులు ఖాతాదారులతో స్థానిక భాషలో కూడా మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి బ్యాంక్ సిబ్బందిక సరిగా తెలియడం లేదని, ఇలాంటి వారు వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లగలరని కడిగిపారేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తదుపరి సంస్కరణల ప్రణాళికల (EASE 3.0) ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మలమ్మ ఈ విధంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా కస్టమర్ల నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. బ్యాంక్ అధికారులు క్షేత్రస్థాయిలో కస్టమర్లతో మమేకం కాలేకపోతున్నారని, ఇది కరెక్ట్ కదని అభిప్రాయపడ్డారు. ‘నేను చెప్పబోయే మాటాలు మీ చెవులకు కటువుగానే ఉండొచ్చు. కానీ మనం కచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కస్టమర్లతో స్నేహపూర్వకంగా మెలగాలి’ అని సూచించారు. బాధ్యతతో వ్యవహరించాలని, ఎవరైనా బ్యాంక్‌కు లోన్ కోసం వస్తే.. ఎందుకు రుణం తీసుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలని, అర్హతలు ఉంటే వారికి రుణం ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు నిర్మలా సీతారామన్ సూచించారు. ఒకవేళ రుణం ఇవ్వడం సాధ్యంకాకపోతే ఆ విషయాన్ని కూడా వారికి కచ్చితంగా బాధ్యతాయుతంగా తెలియజేయాలని పేర్కొన్నారు. అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే గణాంకాలను గుడ్డిగా అనుసరించకుండా.. కస్టమర్ చెప్పిన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆర్‌‌బీఐ కానీ లేదంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కానీ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు అందించే రేటింగ్ ప్రకారమే కస్టమర్లకు రుణాలు అందించాలని మీకు చెప్పాయా? లేదు కదా? అని బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. బ్రాంచ్ స్థాయిలో కస్టమర్లతో అనుబంధం తెగిపోతే.. అది బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈజ్ 3.0 సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ కస్టమర్లకు పలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పామ్ బ్యాంకింగ్ సేవలు సహా ఈజ్ బ్యాంకింగ్ ఔట్‌లెట్స్ ద్వారా బ్యాంకింగ్ ఆన్ గో సర్వీస్‌లను ఆవిష్కరించనున్నారు. మాల్స్, స్టేషన్స్, కాంప్లెక్స్‌లు, క్యాంపస్‌ వంటి రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా డయల్ ఏ లోన్, క్రెడిట్ ఎట్ క్లిక్ వంటి పలు కొత్త సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.





Untitled Document
Advertisements