మనదేశ రాజదాని ఢిల్లీలో ఇటీవల దేశ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను మళ్ళీ హైదరాబాద్ లో సృష్టించాలని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగినట్లు అల్లర్లను మళ్ళీ హైదరాబాద్లోనూ రేకెత్తించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. కాగా ఈ మేరకు ఒక ప్రార్థన కేంద్రం వద్ద విధ్వంసక చర్యలకు కూడా ప్రయత్నించారని తాజా సమాచారం. అంతేకాకుండా ఈ మేరకు ఒక బస్సు ను దహనం చేయడానికి విఫల యత్నం చేశారు. కాగా హైదరాబాద్లోని రియాసత్నగర్కు చెందిన హర్షద్, బాబానగర్కు చెందిన అబ్దుల్ వసీ ఇద్దరు కూడా ఢిల్లీ తరహా అల్లర్లను రాజేయాలని ప్రణాళికలు వేశారు.
అందుకు మాదన్నపేట్ ప్రాంతంలో ఇటీవల ఓ వర్గానికి చెందిన ప్రార్థన కేంద్రం వద్ద విధ్వంసకర చర్యలకు దిగారు. అంతకుముందే ఒక బస్సుకు నిప్పు అంటించడానికి ప్రయత్నాలు కూడా చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఆ ఇద్దరు నిందితులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే వీరికి గతంలో కూడా కేసులు ఉండటం వలన వాటన్నింటిని విచారిస్తున్నారని సమాచారం. అయితే వీరితో పాటే వీరికి సహాయంగా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు.