కేసులు పెరగడం చాల బాధాకరం

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 10:16 AM

ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్ధనలకు ఏపీ నుంచి చాలా మంది ముస్లింలు మత ప్రార్ధనలకు వెళ్ళి రావడంతో వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకింది.

అయితే గత రెండు రోజులుగా కరోనా ఏపీలో కలకలం సృష్టించింది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. అయితే దీనిపై నేడు మీడియాతో మాట్లాడిన సీఎం జగన్ కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని, కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రెండు రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారితో కాంటాక్టులో ఉన్నవారినీ గుర్తిస్తున్నామని జగన్‌ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements