భారత క్రికెటర్ల జీతాల్లో కోత....బీసీసీఐ క్లారిటీ!

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 11:02 AM

భారత క్రికెటర్ల జీతాల్లో కోత....బీసీసీఐ క్లారిటీ!

కరోనా వైరస్ కారణంగా సిరీస్‌లన్నీ రద్దు కావడంతో ఆదాయం కోల్పోయిన అన్ని క్రికెట్ దేశాలు తమ ఆటగాళ్ల జీతాల్లో కొంత మేర కోత విధించాలని యోచిస్తున్నాయి. కానీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ఆటగాళ్లకి పూర్తి జీతాల్ని చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జీతాల కోతపై ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్.. ప్రస్తుతానికి మొత్తం జీతాన్ని క్రికెటర్లకి అందజేయనున్నట్లు స్పష్టం చేశాడు. టీమిండియాకి ఆడే క్రికెటర్లకి ఏటా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని అందజేస్తుంది. ఈ ఏడాది జనవరిలో కొత్త కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు వరకూ మొత్తం 27 మంది ఆటగాళ్లకి అందులో చోటిచ్చింది. ఇందులో మహేంద్రసింగ్ ధోనీకి చోటుకి లభించని విషయం తెలిసిందే. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం.. ఎ+ కేటగిరీలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా‌లకి ఏటా రూ. 7 కోట్లు అందనున్నాయి. అలానే ఎ కేటగిరీలో అశ్విన్, జడేజా, పుజారా, రహానె ఇలా కొంత మంది క్రికెటర్లు ఉండగా వారికి రూ. 5 కోట్లు, బి కేటగిరీ వాళ్లకి రూ. 3 కోట్లు, సి కేటగిరీలో ఉన్న క్రికెటర్లకి రూ. 1 కోటిని బీసీసీఐ అందజేయనుంది. కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. ఒకవేళ టోర్నీ రద్దయితే..? బీసీసీఐకి రూ. వేల కోట్లు నష్టరానుంది. మరోవైపు కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో మే ఆఖరి వరకూ సిరీస్‌లు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నష్టాల నేపథ్యంలో.. ఆటగాళ్ల జీతాలపై కోత పడే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. ప్రస్తుతానికి అలాంటి చర్చే ఏమీ జరగలేదని బోర్డు కోశాధికారి స్పష్టం చేశాడు.





Untitled Document
Advertisements