మర్కజ్ వల్లే తెలంగాణలో కరోనా పెరిగింది : ఈటెల

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:28 PM

మర్కజ్ వల్లే తెలంగాణలో కరోనా పెరిగింది : ఈటెల

తెలంగాణ కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. షాద్‌నగర్‌లో వచ్చిన కేసు.. బిహార్ నుంచి వచ్చిన వలస కూలీ వల్ల సోకిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మందికి కోవిడ్ సోకిందన్న మంత్రి.. వారి కుటుంబ సభ్యులు మరో 13 మందికి కరోనా సోకిందన్నారు. ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ చేసిన నలుగురికి, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి.. మొత్తం 48 మందికి కరోనా వచ్చిందన్నారు. ఏప్రిల్ 4 నాటికి వారికి 14 రోజులు అయిపోతుండటంతో.. తెలంగాణ కరోనా బారి నుంచి బయటపడుతుందని సీఎం కేసీఆర్ ఆశించారని ఈటల తెలిపారు. కానీ ఢిల్లీ మర్కజ్ కారణంగా తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగిందని ఆరోగ్య మంత్రి తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే 3 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని.. 181 మందికి పాజిటివ్ అని రాగా.. వీరంతా ఢిల్లీకి వచ్చిన వారు, వారి సంబంధీకులేనని ఈటల తెలిపారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారి కాంటాక్టులను కూడా పరీక్షలకు పంపిస్తాం.. దీంతో రెండు మూడు రోజుల్లో 99 శాతం కొలిక్కి వస్తుందని మంత్రి తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్టులను గుర్తించాం కాబట్టి.. రెండు మూడు రోజుల్లోనే కరోనా బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లొచ్చిన 1095 మందిని గుర్తించామన్న ఈటల.. 1081 మందిని కంట్రోల్‌లోకి తీసుకున్నామని తెలిపారు. పాజిటివ్ అని తేలిన వారితోపాటు వారి కుటుంబ సభ్యులు, వారు కాంటాక్ట్ అయిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అక్కడక్కడా కొందరు సహకరించకపోయినా.. క్వారంటైన్‌కు తీసుకెళ్తున్నామన్నారు. పరీక్షలు నిర్వహించడానికి అందరూ సహకరించాలని కోరిన ఈటల.. ఎవ్వరనీ వదిలిపెట్టబోం అన్నారు. తెలంగాణలో చాలా కరోనా పరీక్షల కోసం ఆరు సెంటర్లు ఉన్నాయని.. రోజుకు 800-900 వరకు పరీక్షలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం లేదన్న ఈటల.. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. మర్కజ్ కేసులకు మతంతో లింక్ పెట్టొద్దన్నారు.





Untitled Document
Advertisements