ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 12:51 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు బేషరతుగా సమ్మె విరమించారని, ఉపాధి పనులు సక్రమంగా జరగాలంటే వారిని విధులలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా ఫిబ్రవరి 28న ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌తో లక్ష్యాలు సాధించని వారి కాంట్రాక్ట్ రెన్యువల్ చేయరనే ఆందోళనతో సమ్మెకు దిగారే తప్ప వారి సమ్మెలో మరో కోణం లేదని తెలియచేశారు. అయితే ప్రభుత్వం దీనిని గుర్తుంచి వెంటనే వారిని విధులలో చేర్చుకొని ఉపాధి పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు





Untitled Document
Advertisements