ఏపీలో హైఅలర్ట్.. అక్కడ కిలోమీటర్ వరకు రాకపోకలు బంద్!

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 01:06 PM

ఏపీలో హైఅలర్ట్.. అక్కడ కిలోమీటర్ వరకు రాకపోకలు బంద్!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.పదుల సంఖ్యలో ఉన్న కేసుల సంఖ్య వందలు దాటుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అవుతుంది. ఏపీలో పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ అయ్యింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో నిషేదజ్ఞలు అమలవుతున్నాయి. 12 గంటల్లో 14 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు నమోదైన ఇళ్ల వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్ వ్యక్తుల ఇళ్లకు కిలో మీటర్ వరకు రాకపోకలు బంద్ చేస్తున్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ర్యాపిడ్ సర్వే, టెస్టులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్‌ మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని అలర్ట్ చేశారు. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు 266కు చేరుకున్నాయి.

మరోవైపు కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న ప్రాంతాల్ని ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటిస్తుంది. అక్కడ ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని నిబంధనలు విధించింది. వీటితోపాటు ఒకే ప్రాంతంలో ఎక్కువ పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తిస్తున్నారు. ఈ హాట్‌స్పాట్ల వద్ద మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల కనుగుణంగా చీఫ్‌ సెక్రటరీ నీలంసాహ్ని వైద్యారోగ్యశాఖ, పోలీసు అధికారులు, తదితరవిభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకనుగుణంగా అధికారులు పాజిటివ్‌ కేసులు, ‘మర్కజ్‌’ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్‌ పనులు వేగంగా చేస్తున్నారు.

దీంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. హోమ్‌ క్వారంటైన్లలో ఉంటున్నవారిపై వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులతో కూడిన బృందాలు నిఘా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. హోమ్‌క్వారంటైన్లలో ఉంటున్న వారు నిబంధనల కనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అన్న విషయాల్ని పరిశీలిస్తున్నాయి. ఒక్కో బృందం దాదాపు ఇరవై మంది హోమ్‌ క్వారంటైన్‌లోని వ్యక్తులను పరిశీలిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హోమ్‌ క్వారంటైన్‌ ఉంటున్నవారు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా జనంలో కలుస్తున్నారని ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో వారిపై ఎప్పటికప్పడు వలంటీర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది నిఘా ఉంచుతున్నారు.





Untitled Document
Advertisements