నాకు మైండ్ దొబ్బిన మాట నిజం : రాంగోపాల్ వర్మ

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 01:00 PM

నాకు మైండ్ దొబ్బిన మాట నిజం : రాంగోపాల్ వర్మ

హైదరాబాద్, నవంబర్ 20 : దర్శకుడు రాంగోపాల్ వర్మ, హీరో నాగార్జున అనగానే మొదటగా గుర్తొచ్చే సినిమా "శివ". ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. తాజాగా వర్మ దర్శకత్వంలో 'కంపెనీ' పేరిట తీయనున్న చిత్రానికి ముహూర్తపు షాట్ ను కొద్దిసేపటి క్రితం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. "నాగార్జున నాపై నమ్మకం ఉంచి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. నాగార్జునను ఎక్కువగా నమ్ముతానని, కథ విన్న తరువాత నాగ్ రియాక్షన్ చూశాక ఈ సినిమాపై నాకు ఎంతో నమ్మకం పెరిగింది. అయినా గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు. అందులో మైండ్ దొబ్బిందన్న మాట నిజం. కానీ, జ్యూస్ అయిపోయిందా? లేదా? అన్నది ఈ సినిమా తరువాత తెలుస్తుంది" అని చిన్నపాటి కౌంటర్ ఇచ్చారు.





Untitled Document
Advertisements