వాహనదారులకు ఒకేసారి 2 శుభవార్తలు!

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 07:59 PM

వాహనదారులకు ఒకేసారి 2 శుభవార్తలు!

కేంద్రం ప్రభుత్వం తాజాగా వాహనదారులకు తీపికబురు అందించింది. వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మోటార్ వెహికల్స్ చట్టం 1988, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 పరిధిలోకి వచ్చే వెహికల్ డాక్యుమెంట్ దేనికైనాసరే వాలిడిటీ పొడిగింపు వర్తిస్తుంది. అంటే వెహికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కూడా తాజా నిర్ణయం పరిధిలోకి వస్తాయి.

2020 ఫిబ్రవరి 1 తర్వాత ఎక్స్‌పైరీ అయిన వెహికల్ డాక్యుమెంట్లకు తాజాగా వాలిడిటీ పొడిగింపు నిర్ణయం వర్తిస్తుంది. జూన్ 30 వరకు ఎక్స్‌పైరీ అయిన డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయి. రోడ్డు రవాణ అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సంబంధిత డిపార్ట్‌మెంట్లకు ఆదేశాలు జారీ చేసింది.

డాక్యుమెంట్ల వాటిడిటీ పొడిగింపు మాత్రమే కాకుండా మోదీ సర్కార్ వాహనదారులకు మరో శుభవార్త కూడా అందించింది. ఫీజులు ఆలస్యంగా చెల్లించినా కూడా ఎలాంటి ఆలస్య రుసుములు పడవని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. జూలై 31 వరకు ఎలాంటి లేట్ పేమెంట్ చార్జీలు ఉండవని పేర్కొంది.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందువల్ల ఇప్పుడు ఏమైనా ఫీజులు ఆలస్యంగా చెల్లించినా కూడా ఏమీ కాదు. చార్జీలు పడవు. అలాగే డాక్యుమెంట్లు ఎక్స్‌పైరీ అయిపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.





Untitled Document
Advertisements