మీరు చేస్తున్న సాయం ఇప్పటికీ నన్ను గర్వపడేలా చేస్తోంది

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 05:19 PM

కరోనా మహమ్మారి ప్రపంచమంతటా విలయ తాండవం చేస్తోంది. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కరోనాపై పోరుకు ప్రముఖులంతా తమవంతు సాయం అందించారు, ఇంకా అందిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సోనూసూద్‌. వలస కార్మికుల అవస్థలను చూడలేక తన వంతు సాయం చేసిన సోనూసూద్‌ను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. యూపీ, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు కృషి చేశారు. సోనూసూద్ గొప్ప మనసుకు దేశమంతటా ప్రశంసలు కురిపిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘ప్రొఫెష‌న్ ప‌రంగా రెండు దశాబ్దాల నుంచి మీ గురించి నాకు తెలుసు సోనూసూద్‌. మీరు గొప్ప యాక్ట‌ర్ గా ఎదగడం చూసి ఎంతో ఆనందించాను. ప్రస్తుత సంక్షోభ‌ పరిస్థితుల్లో మీరు చేస్తున్న సాయం ఇప్పటికీ నన్ను గర్వపడేలా చేస్తోంది’ అని అన్నారు.





Untitled Document
Advertisements