దేశంలో సామూహిక వ్యాప్తి దశలోకి చేరిన కరోనా

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 12:08 PM

దేశంలో సామూహిక వ్యాప్తి దశలోకి చేరిన కరోనా

వివాహమైన రెండు రోజులకే కరోనా వైరస్‌తో వరుడు మరణించిన విషాద ఘటన బీహార్‌లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పాలిగంజ్ సమీపంలోని దీహపాలికి గ్రామానికి చెందిన ఓ యువకుడు గురుగ్రామ్‌ లో (30) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి వివాహం నిశ్చయం కాగా.. మే 12న గ్రామానికి చేరుకున్నాడు. అయితే, ఆ యువకుడికి కరోనా సోకినా గుర్తించలేకపోయాడు. జూన్ 15న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రెండు రోజులకే వరుడి అనారోగ్యంతో హాస్పిటల్‌లో మృతిచెందాడు.



అనంతరం అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో, వివాహానికి హాజరైన అతిథులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 100 మందికిపైగా వైరస్ పాజిటివ్ అని తేలింది. దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందనడాకి ఇదో ఉదాహరణ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వివాహానికి 111 మంది వరకూ హాజరయ్యారు. వివాహ వేడుక ముగిసిన తర్వాత వరుడి అనారోగ్యానికి గురికావడంతో అతడిని పాట్నాలోని హస్పిటల్‌కు తరలించారు. డయోరియాతో హాస్పిటల్‌లో చేరిన మర్నాడే ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకుంది. వరుడి బంధువుల్లోనూ కొందరికి డయోరియా లక్షణాలు బయటపడగా.. వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కరోనాలో రోజురోజుకు కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తే అవి కరోనాకు సంబంధించినవి. ఈ లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే తాజాగా కరోనాలో మరో మూడు కొత్త లక్షణాలను చేర్చింది అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలు అని తెలిపింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఆ సంస్థ తెలిపింది. దీంతో రోజురోజుకి కొత్త కొత్త లక్షణాలు బయపడటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు.





Untitled Document
Advertisements