ఐపీఎల్ 2020 అడ్డుకట్టకు పాక్ విశ్వ ప్రయత్నాలు!

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 12:55 PM

ఐపీఎల్ 2020 అడ్డుకట్టకు పాక్ విశ్వ ప్రయత్నాలు!

ఐపీఎల్ 2020 సీజన్‌ని అడ్డుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరవధికంగా వాయిదా వేసింది. అయితే.. ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడే సూచనలు కనిపిస్తుండటంతో.. సెప్టెంబరు- నవంబరు మధ్యలో ఐపీఎల్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుంది.
ఐపీఎల్ 2020 సీజన్‌కి మార్గం సుగుమం అవుతుండటంతో పాకిస్థాన్ కొత్త వాదనల్ని తెరపైకి తెస్తోంది. తొలుత టీ20 వరల్డ్‌కప్ వాయిదా నిర్ణయాన్ని ఐసీసీ ఆలస్యం చేసేలా పావులు కదిపిన పాకిస్థాన్.. ఆ తర్వాత సెప్టెంబరులో ఆసియా కప్‌ని శ్రీలంక వేదికగా నిర్వహిస్తామని తెలిపింది. దాంతో.. సెప్టెంబరు ఆఖరి నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లకి బీసీసీఐ షెడ్యూల్ రూపొందిస్తుండగా.. నవంబరులో ఆరంభం నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మిగిలిన మ్యాచ్‌లను నిర్వహిస్తామని పీసీబీ బాంబ్ పేల్చింది.

కరోనా వైరస్ కారణంగా మార్చిలో పీసీఎల్ ఆఖరి దశ మ్యాచ్‌లు నిలిచిపోగా.. నవంబరు 5 నుంచి వాటిని నిర్వహిస్తామని పీసీబీ తాజాగా ప్రకటించింది. ఐపీఎల్‌లో ఆడే విదేశీ క్రికెటర్లలో కొంత మంది పీసీఎస్‌లో కూడా ఆడుతున్నారు. మొత్తంగా సెప్టెంబరు - నవంబరు మధ్యకాలంలో ఆసియా కప్, పీఎస్‌ఎల్ టోర్నీలను నిర్వహిస్తామని పీసీబీ ప్రకటించడం ద్వారా.. ఐపీఎల్‌‌పై బీసీసీఐని పాక్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.





Untitled Document
Advertisements