పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిదీ అఫ్రిదీ కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. గత మార్చి నుంచి పాక్లో లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ‘అఫ్రిది ఫౌండేషన్’ తరఫున పేదలకి నిత్యావసరాల్ని పంపిణీ చేసిన అఫ్రిదీ.. జూన్ నెలలో తనకి కరోనా వైరస్ సోకినట్లు స్వయంగా వెల్లడించాడు. అఫ్రిదీకే కాదు అతని భార్య, ఇద్దరు కూతుళ్లకి కూడా ఆ తర్వాత కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా వైరస్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన అఫ్రిది.. హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకున్నాడు. దాంతో.. కొన్ని రోజుల పాటు అతని ఆరోగ్యం గురించి అభిమానులకి సమాచారం తెలియరాలేదు. కానీ.. అఫ్రిది ఆరోగ్యం విషమించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో.. ఫేస్బుక్ లైవ్లోకి వచ్చిన అఫ్రిది.. తన ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వెల్లడించాడు. కరోనా వైరస్ నుంచి తనతో పాటు భార్య, పిల్లలు కూడా కోలుకున్నట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా అఫ్రిది వెల్లడించాడు. పరీక్షలు చేయించుకోగా.. అందరికీ నెగటివ్ వచ్చినట్లు చెప్పుకొచ్చిన అఫ్రిది.. అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.
Alhamdulillah, my wife amp; daughters, Aqsa amp; Ansha have re-tested after our previously positive results for #COVIDー19, amp; are now clear. Thanking u all for your continuous well wishes, amp; may the Almighty bless you and yours. Now back to family time; I’ve missed holding this one pic.twitter.com/J5mDv7DnBD
mdash; Shahid Afridi (@SAfridiOfficial) July 2, 2020