పాలసీ ప్రీమియం చెల్లించని వారికి ఎల్‌ఐసీ శుభవార్త

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 12:43 PM

పాలసీ ప్రీమియం చెల్లించని వారికి ఎల్‌ఐసీ  శుభవార్త

మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉందా? ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రీమియం చెల్లించలేకపోయారా? దీంతో మీ పాలసీ ల్యా్ప్స్ అయిపోయిందా? అయితే బాధపడొద్దు. మీకోసం ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. ల్యాప్స్ అయిన పాలసీని మళ్లీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు.

దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ల్యాప్స్ అయిపోయిన పాలసీలను మళ్లీ రెగ్యులరైజ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో ల్యాప్స్ అయిన పాలసీ కలిగిన వారు వెంటనే వారి పాలసీని రెగ్యులర్ చేసుకోండి. !

ఎల్‌ఐసీ పాలసీదారులు వారి ల్యాప్స్ అయిన పాలసీలను ఆగస్ట్ 10 నుంచి అక్టోబర్ 9 వరకు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు ల్యా్ప్స్ అయిన పాలసీలను ఇప్పుడు పునరుద్ధరించుకోవచ్చు. అంతేకాకుండా పాలసీదారులు లేట్ ఫీజులో 30 శాతం వరకు తగ్గింపు కూడా పొందొచ్చు.

మీరు రూ.లక్ష వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే ఆలస్య రుసుములో 20 శాతం తగ్గింపు పొందొచ్చు. అదే రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్యలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటే.. లేట్ ఫీజులో 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక రూ.3 లక్షలకు పైన ప్రీమియం కట్టాల్సి ఉంటే ఆలస్య రుసుముపై 30 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించుకోవడం వల్ల పాలసీ ప్రయోజనాలు మళ్లీ తిరిగి పొందొచ్చు.





Untitled Document
Advertisements