ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 10:27 PM

ఏపీలో తగ్గుముఖం పట్టిన  కరోనా కేసులు!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఎప్పటి మాదిరిగానే వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 5 రోజులుగా ప్రతి రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే దీనికి కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహించడమే కారణంగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, సోమవారం 46 వేలకు పైగా పరీక్షలు మాత్రమే నిర్వహించారు. ఆదివారం కావడంతో కరోనా పరీక్షలు తగ్గించినట్లు తెలుస్తోంది. దీంతో కేసులు సంఖ్య తగ్గినట్లుగా తెలుస్తోంది.



తాజాగా, సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో 7,665 కేసులు నమోదయ్యాయి. అలాగే 24 గంటల్లో రికార్డు స్థాయిలో 80 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 46,999 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 7,665 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,35,525కు చేరింది.


ఇక గడచిన 24 గంటల్లో 80 మంది కరోనా బారినపడి మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 2,116కు పెరిగింది. ఇక, కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 11 మంది, గుంటూరులో 10 మంది, పశ్చిమ గోదావరిలో 9 మంది, కడపలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇక గడిచిన 24 గంటల్లో 6,924 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,35,525 పాజిటివ్ కేసులకు గాను 1,45,636 మంది డిశ్చార్జి కాగా.. 87,773 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 32,938 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.





Untitled Document
Advertisements