దగ్గరకు వస్తున్న కేసీసీ లోన్స్ గడువు...ఆగస్ట్ 31 డెడ్‌లైన్

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:27 PM

దగ్గరకు వస్తున్న కేసీసీ లోన్స్ గడువు...ఆగస్ట్ 31 డెడ్‌లైన్

అన్నదాతలకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డు మీద రుణాలు పొందిన రైతన్నలకు డెడ్‌లైన్ దగ్గరకు వస్తోంది. ఇంకో 20 రోజుల్లోగా తీసుకున్న రుణాన్ని కచ్చితంగా తిరిగి చెల్లించాల్సి ఉంది.

ఒకవేళ తీసుకున్న రుణ మొత్తాన్ని చెల్లించలేకపోతే మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంది. 4 శాతం కాకుండా 7 శాతం వడ్డీ పడుతుంది. రైతులు బ్యాంక్ నుంచి తీసుకున్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలను ఆగస్ట్ 31లోపు తిరిగి చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

కేసీసీ రుణాలను సాధారణంగా మార్చి 31లోపు తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ గడువును తొలిగా మే వరకు తర్వాత మళ్లీ ఆగస్ట్ చివరి వరకు పొడిగించింది. దీంతో ఇప్పుడు రైతులు పంట రుణాలను ఆగస్ట్ 31లోపు చెల్లించి వడ్డీ రాయితీ ప్రయోజనం పొందొచ్చు.

రైతులు డబ్బులు చెల్లించి ఒక రెండు రోజుల తర్వాత వాటిని మళ్లీ తీసుకోవచ్చు. అందువల్ల ఆగస్ట్ లోపు డబ్బులు చెల్లిస్తే 4 శాతం వడ్డీ పడుతుంది. ఆగస్ట్ 31 దాటితే 7 శాతం వడ్డీ చెల్లించాలి. అందువల్ల గడువు దాటితే రైతులు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల గడువులోగా డబ్బులు కట్టేయండి. చేతిబదులు తీసుకొని కూడా డబ్బులు చెల్లించొచ్చు.





Untitled Document
Advertisements