అద్దం లాంటి టీవీని లాంచ్ చేసిన షియోమీ...ధర రూ.5.37 లక్షలు!

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 07:06 PM

అద్దం లాంటి టీవీని లాంచ్ చేసిన షియోమీ...ధర రూ.5.37 లక్షలు!

ఎంఐ టీవీ లక్స్ ట్రాన్స్ పరెంట్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయింది. పూర్తి పారదర్శకంగా దీని స్క్రీన్ ఉండటం విశేషం. అంటే స్క్రీన్ కు అటువైపు ఎవరైనా ఉంటే ఇటువైపు ఉన్నవారికి స్పష్టంగా కనిపించేలా ఈ టీవీని డిజైన్ చేశారు. ఫుల్ హెచ్ డీ ఓఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. దీని రిఫ్రెష్ రేట్ ఎక్కువగా ఉంది. దీంతోపాటు దీని రంగుల కచ్చితత్వం కూడా బాగుంది. ఫోన్ పక్క అంచులు సన్నగానే ఉన్నప్పటికీ, కింద భాగంలో అంచులు కాస్త మందంగా ఉన్నాయి.

ఎంఐ టీవీ లక్స్ ట్రాన్స్ పరెంట్ ఎడిషన్ ధర
దీని ధరను చైనాలో 49,999 యువాన్లుగా(సుమారు రూ.5.37 లక్షలు) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. చైనాలో దీనికి సంబంధించిన సేల్ ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మిగతా దేశాల్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.

ఎంఐ టీవీ లక్స్ ట్రాన్స్ పరెంట్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు
ఇందులో 55 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఓఎల్ఈడీ ట్రాన్స్ పరెంట్ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉండటం విశేషం. క్వాడ్ కోర్ కార్టెక్స్ ఏ-53 ప్రాసెసర్ పై ఈ టీవీ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్, డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ హెచ్ డీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ట్రాన్స్ పరెంట్ టీవీ కావడంతో టీవీ వెనకవైపు ఎటువంటి లైటింగ్ ఉండదు. దీంతో ఇమేజ్ తేలుతున్నట్లు అనిపిస్తుంది. అదే ఇందులోని ప్రధాన ప్రత్యేకత. ఫోన్ పై భాగంలో, పక్కన అంచులు సన్నగానే ఉన్నా, కింద భాగంలో అంచులు చాలా పెద్దగా ఉన్నాయి. కింద ఉన్న గుండ్రటి ప్రదేశంలోనే ప్రాసెసింగ్ యూనిట్, స్పీకర్లు ఉన్నాయి. దీని వెనకభాగంలో పోర్టులను పెట్టుకోవచ్చు.

ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు, ఒక ఏవీ పోర్టు, ఇథర్ నెట్ పోర్టు ఉన్నాయి. టీవీల కోసం రూపొందించిన ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. దీని బరువు 24.96 కేజీలుగా ఉంది. మందం మాత్రం కేవలం 0.57 సెంటీమీటర్లు మాత్రమే ఉండటం విశేషం.





Untitled Document
Advertisements