కేంద్రంలో మరో మంత్రికి కరోనా వైరస్

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 08:03 PM

కేంద్రంలో మరో మంత్రికి కరోనా వైరస్

కేంద్రంలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. ఆయుష్ మంత్రి శ్రీపాద వై నాయక్‌ తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. కేంద్రంలో ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కరోనా వైరస్ బారినపడిన పడి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

‘ఇవాళ నేను కరోనా పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. నేను హోమ్ ఐసోలేషన్ ఉన్నాను. గడిచిన కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా’ అని మంత్రి శ్రీపాద నాయక్ ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements