దుమ్మురేపిన స్టాక్...రూ.లక్ష పెడితే చేతికి రూ.4 లక్షలు

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 11:10 AM

దుమ్మురేపిన స్టాక్...రూ.లక్ష పెడితే చేతికి రూ.4 లక్షలు

డబ్బు సంపాదించాలని అందరూ భావిస్తారు. తక్కువ కాలంలోనే అదిరిపోయే రాబడి పొందాలని యోచిస్తుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యంకాకపోవచ్చు. తక్కువ కాలంలో కళ్లుచెదిరే లాభం పొందడం అంత సులభం కాదు. కానీ ఇక్కడ ఇదే జరిగింది. అదిరిపోయే లాభం లభించింది. ఏడాది కిందట రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు చేతికి రూ.4 లక్షలు పొంది ఉండేవారు.

ఎలా అని ఆలోచిస్తున్నారా? స్టాక్ మార్కెట్. అవును స్టాక్ మార్కెట్‌లో ఒక షేరు అదిరిపోయే రాబడి అందించింది. ఈ షేరు పేరు లారస్ ల్యాబ్స్. ఈ స్టాక్ ధర భారీగా పెరిగింది. లారస్ ల్యాబ్స్ షేరు ధర ఇటీవల రూ.1550 స్థాయిని తాకింది. ప్రస్తుతం షేరు ధర రూ.1420 సమీపంలో కదలాడుతోంది.

లారస్ ల్యాబ్స్ షేరు ఈ ఏడాది ఆరంభం నుంచి చేస్తే ఇన్వెస్టర్లకు ఏకంగా 300 శాతానికి పైగా రాబడి అందించింది. జనవరి 1న ఈ కంపెనీ షేరు ధర రూ.368 వద్ద ఉండేది. కానీ ఇటీవల షేరు ధర ఏకంగా రూ.1500 పైకి చేరింది. కంపెనీ ప్రధానంగా ఏపీఐ, ఫార్ములేషన్, సింథసిస్ వంటి వాటి ద్వారా ఆదాయం పొందుతుంది.

కంపెనీ డైవర్సిఫికేషన్ కారణంగా ఏపీఐ, ఫార్ములేషన్స్ అమ్మకాలు భారీగా పెరిగాయని అందుకే ఈ స్థాయిలో కంపెనీ షేరు ర్యాలీ చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ పీరియడ్ కూడా కలిసొచ్చిందని తెలిపారు. 2018 నుంచి 2020 వరకు కంపెనీ తన సత్తా ఏంటో తెలియజేసిందని పేర్కొన్నారు. కంపెనీ ఏపీఐ అండ్ ఫార్ములేషన్ విభాగం ఆదాయం ఈ కాలంలో రూ.5 కోట్ల నుంచి రూ.825 కోట్లకు చేరిందని వివరించారు.

ఇకపోతే షేరు ధర మరింత పెరగొచ్చని స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే లారస్ ల్యాబ్స్ షేరు ధర రూ.1620కు చేరొచ్చని టార్గెట్ పెట్టుకుంది. ఈ షేరు కొనుగోలు చేయొచ్చని సిఫార్సు చేస్తోంది. అంతేకాకుండా కంపెనీ కూడా తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని యోచిస్తోంది.





Untitled Document
Advertisements