కళ్లుచెదిరే లాభం...రూ.5 లక్షలు పెడితే చేతికి రూ.10 లక్షలు!

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 11:36 AM

కళ్లుచెదిరే లాభం...రూ.5 లక్షలు పెడితే చేతికి రూ.10 లక్షలు!

డబ్బు సంపాదించాలని భావించే వారికి స్టాక్ మార్కె్ట్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ రిస్క్ కూడా భారీగానే ఉంటుంది. అటూఇటూ అయితే చేతిలో డబ్బులు మొత్తం పొగొట్టుకోవాల్సి రావొచ్చు. రిస్క్‌ ఉన్న చోటే లాభం కూడా ఉంటుందని గమనించాలి. అదిరిపోయే లాభం పొందాలని భావిస్తే స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెట్టాలి.

ఇప్పుడు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPO)లు అదరగొడుతున్నాయి. ఇటీవల ఐపీవోకు వచ్చిన హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ తన ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే లాభాన్ని అందిచింది. బంపర్ లిస్టింగ్‌తో ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది. ఇప్పుడు కూడా ఒక ఐపీవో ఇన్వెస్టర్ల సంపదను డబుల్ చేసింది. అదే రూట్ మొబైల్ ఐపీవో.

రూట్ మొబైల్ షేర్లు కూడా బీఎస్‌ఈలో బంపర్ లిస్టింగ్‌ అయ్యాయి. ఈ కంపెనీ షేరు తొలి రోజులోనే ఏకంగా 105 శాం పరుగులు పెట్టింది. రూ.725 స్థాయికి చేరింది. రూట్ మొబైల్ షేరు ఇష్యూ ప్రైస్ రూ.350. అంటే షేరు ధర రెట్టింపు అయ్యింది. దీంతో ఈ షేర్లు కొనుగోలు చేసిన వారి డబ్బు కూడా రెట్టింపు అయ్యిందని చెప్పుకోవచ్చు.

రూట్ మొబైల్స్ ఐపీవో 75 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. కంపెనీ ఐపీవో ద్వారా రూ.600 కోట్లు సమీకరించింది. రూట్ మొబైల్ కంపెనీ క్లౌడ్ కమ్యూనికేషన్స్ సర్వీసర్ ప్రొవైడర్‌గా పనిచేస్తుంది. ఐపీవోలో 89 కోట్ల షేర్లకు గానూ బిడ్లు వచ్చాయి. కంపెనీ జారీ చేసిన షేర్లు 1.21 కోట్లు. రిటైల్ ఇన్వెస్టర్లు 12.85 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇక క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 91 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇక నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 195 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

ఇకపోతే క్యామ్స్, కెమ్‌కాన్ ఆఫ్ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ వంటి సంస్థలు కూడా ఇప్పుడు ఐపీవోకు వస్తున్నాయి. వీటిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే రూట్ మొబైల్స్ ఐపీవో ద్వారా సమీకరించిన డబ్బులను రుణ భారం తగ్గించుకోవడానికి, కొనుగోళ్లు, ఇతర వ్యూహాత్మన భాగస్వామ్యాల కోసం వెచ్చించనుంది.





Untitled Document
Advertisements