కరోనా మరణాల సంఖ్య : 90000 పై చులకు... కలవరపెడుతున్న మహమ్మారి

     Written by : smtv Desk | Wed, Sep 23, 2020, 06:07 PM

దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 56 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 83,347 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,46,011కు చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,085 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 90,020కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 45,87,614 మంది కోలుకున్నారు. 9,68,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,62,79,462 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,53,683 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.





Untitled Document
Advertisements