వివాదంలో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 02:22 PM

వివాదంలో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం

మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులు వివాదంలో చిక్కుకున్నారు. రూ.కోటి అప్పుకు.. రూ.10కోట్ల విలువైన భూమిని ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. పరిటాల సునీత సోదరుడు మురళి దగ్గర వ్యాపారి మేడా చంద్రశేఖర్ కోటి రూపాయలు అప్పు తీసుకున్నాడు. మురళి తన మామ వేలూరు రామాంజపేయులు పేరుతో అగ్రిమెంట్‌ను రిజిస్టర్‌ చేయించాడు. బాధితుడు మేడ చంద్రశేఖర్ తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తానన్నా మురళి, అతని మామ రామాంజనేయులు నిరాకరించాడని చెబుతున్నాడు.

కురుగుంట వద్ద చంద్రశేఖర్‌ పేరు మీద ఉన్న రూ.10 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని బలవంతంగా అప్పు కింద జమ చేసుకున్నాడు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా 2.75 రూపాయల వడ్డీతో అప్పు వసూలు చేసినట్లు తేలింది. తనను బెదిరించి భూమిని అక్రమంగా రిజిస్టర్‌ చేయించుకున్నారని బాధితుడు చంద్రశేఖర్‌ ఆరోపించాడు. మాజీ మంత్రి పరిటాల సునీత, కుమారుడు శ్రీరామ్‌కు చెప్పినా పట్టించుకోలేదన్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. అలాగే ఈ భూమి వ్యవహారంపై పరిటాల ఫ్యామిలీ కూడా స్పందించాల్సి ఉంది.





Untitled Document
Advertisements