అమెరికా అధ్యక్ష పీఠంపై గురిపెట్టిన ట్రంప్

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 09:04 PM

అమెరికా అధ్యక్ష పీఠంపై గురిపెట్టిన ట్రంప్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు. డెమొక్రాట్ నుంచి జో బిడేన్ బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో బిడేన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోన్న డొనాల్డ్ ట్రంప్.. బుధవారం చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగుతోంది. తాను ఎన్నికల్లో ఓడిపోతే అధికార బదిలీ అంత ప్రశాంతంగా జరగకపోవచ్చంటూ ట్రంప్‌ వ్యాఖ్యలుచేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అధ్యక్ష భవనం వివరణ ఇవ్వాల్సి ఇచ్చింది.

అన్నీ సజావుగా, పారదర్శకంగా జరిగితే ఎన్నికల ఫలితాల్ని ట్రంప్ స్వీకరిస్తారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎన్నికల ఫలితాల్ని అంగీకరించరబోమని డెమోక్రాటిక్‌ పార్టీ నాయకులే పదే పదే అంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల్ని ఎలా స్వీకరించబోతున్నారని వారినే ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. ‘ట్రంప్‌ గెలిస్తే ఫలితాల్ని అంగీకరించేది లేదంటూ’ పలు సందర్భాల్లో డెమొక్రాట్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఉటంకించారు.

కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌లపై మొదటి నుంచి తనకు అభ్యంతరాలు ఉన్నాయని ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్... ఎన్నికల్లో ఓడిపోతే అధికార బదిలీ విషయంలో ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల విధానంపై తనకు నమ్మకంలేదని, ఫలితాలపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లొచ్చని అన్నారు. దీంతో ఆయన మాటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్‌ ఓటమిని జీర్ణించుకోని ట్రంప్.. అధ్యక్ష భవనాన్ని వీడేందుకు నిరాకరిస్తారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినా దాదాపు 2.86 మిలియన్ ఓట్లను కోల్పోయారు. దీంతో ఓటింగ్ సిస్టమ్‌పై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో ట్రంప్ వ్యక్తం చేసిన సందేహాలను నిపుణులు కూడా సమర్ధిస్తున్నారు. అధికార మార్పిడిపై ట్రంప్ వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. నవంబరు 3న జరిగే ఎన్నికల్లో విజేత జనవరి 20న అధికారం చేపడతారు.. 1792 నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ పరివర్తన కొనసాగుతోంది తఅని రిపబ్లికన్ నేత మిట్చ్ మెక్‌కొనెల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.





Untitled Document
Advertisements