ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక... లాస్ట్‌లో SRH

     Written by : smtv Desk | Sun, Sep 27, 2020, 12:18 PM

ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక... లాస్ట్‌లో SRH

ఐపీఎల్ 2020లో వారం రోజులు మ్యాచ్‌లు ముగిశాయి. భారీ అంచనాలతో టోర్నీలోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అంచనాల్ని అందుకోలేక చతికిలపడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఇక టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. జీరో పాయింట్లతో చిట్ట చివరి స్థానానికి పరిమితమైంది. టోర్నీలో 8 జట్లు పోటీపడుతుండగా.. ఇప్పటి వరకూ గెలుపు బోణీ అందుకోని జట్టు సన్‌రైజర్స్ మాత్రమే.

ఐపీఎల్ 2020 సీజన్ లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రతి జట్టూ మిగిలిన ఏడు జట్లతో రెండేసి మ్యాచ్‌లను ఆడనుంది. ఈ క్రమంలో లీగ్ దశ ముగిసే సమయానికి ప్రతి జట్టూ 14 మ్యాచ్‌లు ఆడనుండగా.. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి. ప్రస్తుతం టాప్-4లో ఢిల్లీతో పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. దాంతో.. చెన్నై, బెంగళూరు జట్లు ఒక్కో స్థానానికి దిగబాకగా.. హైదరాబాద్ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. 2016లో టైటిల్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. గత ఏడాది కూడా ప్లేఆఫ్‌కి అర్హత సాధించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements