ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక: మూడోస్థానంలో RCB

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 07:49 PM

ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక: మూడోస్థానంలో RCB

ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ (22 బంతుల్లో 55 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరును గెలిపించాడు. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు చేరగా.. ఓడిన రాజస్థాన్ ఆరు పాయింట్లకే పరిమితమైంది. చెన్నైతో మ్యాచ్ ప్రారంభానికి ముందు పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలో, ముంబై రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు జట్లతోపాటు.. బెంగళూరు ఖాతాలోనూ 12 పాయింట్లే ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ వ్యత్యాసం కారణంగా బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ జట్లకు ఆరు పాయింట్లే ఉన్నప్పటికీ.. సన్‌రైజర్స్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ధోనీ సేన 4వ స్థానానికి చేరుకుంటుంది. చెన్నై ఓడితే మాత్రం పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 448 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. 18 వికెట్లతో ఢిల్లీ బౌలర్ కగిసో రబాడ పర్పుల్ క్యాప్‌ హోల్డర్‌గాా నిలిచాడు. రాజస్థాన్‌పై 22 బంతుల్లోనే 55 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన ఏబీ డివిలియర్స్.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఏబీడీ 8 ఇన్నింగ్స్‌ల్లో 230 రన్స్ చేశాడు. తన కంటే పైనున్న 14 మంది బ్యాట్స్‌మెన్ కంటే డివిలియర్స్ స్ట్రైక్ రేట్ (179.69) ఎక్కువగా ఉండటం గమనార్హం.





Untitled Document
Advertisements