స్టేడియంలోకి 25 శాతం అభిమానులకు మాత్రమె ఎంట్రీ!

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 04:00 PM

స్టేడియంలోకి 25 శాతం అభిమానులకు మాత్రమె ఎంట్రీ!

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టు మ్యాచ్‌కి ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అనుమతించబోమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 50 శాతం ప్రేక్షకుల్ని మాత్రమే స్టేడియంలో అనుమతిస్తూ వచ్చిన సీఏ.. సిడ్నీలో ఇటీవల వైరస్ వ్యాప్తి మరింత పెరగడంతో మూడో టెస్టుకి కేవలం 25 శాతం అభిమానుల్ని మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.

సిడ్నీ క్రికెట్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 48,000కాగా.. మూడో టెస్టుకి 25 శాతం అంటే కేవలం 12,000 మందిని మాత్రమే గ్రౌండ్‌లోకి అనుమతించనున్నారు. సిడ్నీలో తాజా రిపోర్ట్ ప్రకారం.. 188 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో.. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకుల్ని అనుమతిస్తే..? సామాజిక దూరం పాటించడం కష్టమవుతుందని సీఏ భావిస్తోంది. అలానే బ్రిస్బేన్ వేదికగా జనవరి 15 నుంచి 19 వరకూ జరగాల్సిన నాలుగో టెస్టు మ్యాచ్‌ని కూడా సిడ్నీకి సీఏ మార్చేసింది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. చెరొక మ్యాచ్‌లో గెలవడంతో ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. దాంతో కీలకమైన మూడో టెస్టులో గెలవాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.





Untitled Document
Advertisements