జనవరి 26న ఫౌజీ గేమ్ లాంచ్

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 07:44 PM

జనవరి 26న ఫౌజీ గేమ్ లాంచ్

పబ్జీకి పోటీగా ఫౌజీ అనే గేమ్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్‌ను జనవరి 26వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు గేమ్ ట్రైలర్ కూడా లాంచ్ అయింది. పబ్జీకి పోటీనిచ్చే భారతీయ గేమ్ ఇదే అని దీని మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ గేమ్ అక్టోబర్‌లోనే లాంచ్ కావాల్సి ఉన్నప్పటికీ.. మెల్లగా అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు దీని అధికారిక లాంచ్ తేదీని ప్రకటించారు.

బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఫౌజీ జనవరి 26వ తేదీన లాంచ్ కానుందని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీ-రిజిస్ట్రేషన్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ గేమ్‌కి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌కు మద్దతుగా ఈ గేమ్ లాంచ్ చేస్తున్నామని తెలుపుతూ ఈ ట్రైలర్‌ను ముగించారు.

బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్ ఈ గేమ్‌ను డెవలప్ చేసింది. దీని ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల ప్రీ-రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

టీజర్ ప్రకారం ఈ గేమ్ గాల్వన్ లోయ వివాదం నేపథ్యంలో ఉంటుంది. దీని మొదటి టీజర్‌ను అక్టోబర్ 25వ తేదీన విడుదల చేశారు. ఈ గేమ్ అక్టోబర్‌లోనే లాంచ్ కావాల్సింది కానీ ఆలస్యమైంది. తర్వాత నవంబర్‌లో లాంచ్ కానుందని ప్రకటించారు. కానీ నెలాఖరులో ప్రీ-రిజిస్ట్రేషన్లు మాత్రమే ప్రారంభించారు. ఇప్పుడు ఈ గేమ్ జనవరి 26వ తేదీన లాంచ్ కానుందని ప్రకటించారు.

పబ్జీ కూడా తిరిగి వస్తామని ప్రకటించినప్పటికీ దీనికి సంబంధించిన అప్రూవల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఫౌజీ గేమ్ మాత్రం మొదటి నుంచి చైనాపై ఉన్న వ్యతిరేకత మీదనే రూపొందుతుంది. అంతేకాకుండా గేమ్ నేపథ్యం కూడా గాల్వన్ లోయ వివాదం నేపథ్యంలోనే ఉంది.


ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని కూడా ఫౌజీ అందిపుచ్చుకుంది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్టుకి అందిస్తామని తెలిపింది. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ఈ ట్రస్టును ప్రారంభించింది.





Untitled Document
Advertisements