ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై రగడ కొనసాగుతుండగానే.. ప్రకాశం జిల్లాలో మరో ఘటన కలకలంరేపింది. సింగరాయ కొండ మండలం పాతసింగరాయకొండ దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి ఉన్నవరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై ఉన్న మూడు విగ్రహాల (లక్ష్మీనరసింహ స్వామి, రాజ్యలక్ష్మీ, గరుత్మంతుడు) చేతులు విరిగిపోయాయి. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనాస్థలాలనికి చేరుకొని ముఖద్వారాన్ని, విగ్రహాలను పరిశీలించారు. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా.. లేక వాటంతట అవే విరిగిపోయాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలియడంతో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు.