బీజేపీ ఏజెంట్ కాకపోతే తిరుపతిలో పోటీ చేసేవాడివి: కేఏ పాల్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:34 PM

బీజేపీ ఏజెంట్ కాకపోతే తిరుపతిలో పోటీ చేసేవాడివి: కేఏ పాల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా.. ఎంపీగా గెలవకుండానే ఏడు పార్టీలు మారారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కేఏ పాల్. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు ఏకే పాల్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఏజెంట్‌ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారా. కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ తమ్ముడికి అతని ఫ్యాన్స్ ఒకసారి గట్టిగా చెప్పండి.. ఇదేం విచిత్రమో ఇప్పటికే ఏడు పార్టీలు మారావు. మీ ఒరిజినల్ పార్టీ ప్రజారాజ్యం.. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. తరువాత సీపీఐ సీపీఎం.. ఆ తరువాత బీఎస్పీ మాయావతి కాళ్లపై పడ్డావ్ తమ్ముడూ.. మరలా బీజేపీ అన్నావ్.. మళ్లీ ఇప్పుడు బీజేపీ అంటున్నావ్.

మొన్న తెలంగాణలో పోటీ చేస్తాఅన్నావ్.. ఆ తరువాత పోటీ చేయను బీజేపీకి మద్దతు ఇస్తా అన్నావ్. నీకు ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉంది కదా.. బీజేపీకి ఒక్కశాతం కూడా ఓటింగ్ లేదు. నువ్వు బీజేపీ ఏజెంట్ కాకపోతే తిరుపతిలో ఖచ్చితంగా పోటీ చేసేవాడివి.

తెలుగు ప్రజలు మూర్ఖులు కాదు.. కాపులారా.. బడుగు బలహీన వర్గాల ప్రజలారా.. పవన్‌ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో గమనించండి. నా భార్య క్రిస్టియన్.. నా కూతురు క్రిస్టియన్ అని చెప్తావ్.. ఎందుకయ్యా చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటావ్. ఎక్కడ నుంచో తెచ్చుకున్న భార్యని క్రైస్తవరాలు అంటావా?? అసలు నీకు నీతి నిజాయితీ ఉంటే.. నీ ఫ్యాన్స్ మీద గౌరవం ఉంటే.. నిజంగా నువ్ సేవ చేయాలి అనుకుంటే నువ్వు తిరుపతిలో నిలబడు.. లేదంటే మీ అన్నని నిలబెట్టు.. నీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తినైనా నిలబెట్టు తిరుపతి బై పోల్‌లో. అప్పుడు నువ్ బీజేపీ ఏజెంట్ కాదని రుజువు చేసుకో.

నువ్ తిరుపతిలో పోటీ చేస్తే చాలా మంది సపోర్ట్ చేస్తారు.. అంతెందుకు నాకు ఫోన్ చేస్తే నేనే సపోర్ట్ చేస్తా. ప్రచారం చేస్తా.. బీజేపీకి ఒక్కరు కూడా ఓటు వేయకండి.. ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి కానీ.. బీజేపీ చెప్పినట్టుగా చేస్తున్న వైసీపీ పార్టీ కానీ.. పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ ఒక్కరు కూడా ఓటు వేయకూడదు. చిత్తు చిత్తుగా ఓడించాలి’ అంటూ తిరుపతి ఓటర్లకు పిలుపునిచ్చారు కేఏ పాల్.





Untitled Document
Advertisements