బర్డ్ ఫ్లూ....చికెన్, ఎగ్స్ తినొచ్చా?!

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:57 PM

బర్డ్ ఫ్లూ....చికెన్, ఎగ్స్ తినొచ్చా?!

కరోనా వైరస్‌కు తోడు ఇప్పుడు కొత్త వైరస్ జనాన్ని టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ప్రజల్ని భయపెడుతోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఫ్లూ కలకలం రేపింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పలురాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వాలే చికెన్ అమ్మకాలపై నిషేధం విధించాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చికెన్ తినకూడదా ? లేక తినోచ్చా అనే దానిపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చికెన్‌ని బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం లేదు. 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉడకబెట్టి వండితే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. WHO, UN వంటి సంస్థలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఎటువంటి రా మీట్ నైనా 70 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉడకబెడితే, బ్యాక్టీరియాలు, వైరస్ లు చనిపోతాయి. దీంతో వైరస్, బ్యాక్టీరియాల నుంచి హాని ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కోడిగుడ్లను, చికెన్ ను నీటితో శుభ్రం చేస్తే సరిపోతుందని కొందరు భావిస్తారు. అయితే, ఇలాంటి సమయాల్లో వైరస్ లు చనిపోయే అవకాశాలు చాలా తక్కువ. కచ్చితంగా చికెన్ ను, గుడ్లను సరియైన ఉష్ణోగ్రతల వద్ద ఉడకబెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బర్డ్ ఫ్లూ, వైరస్ విస్తరిస్తన్న ఇలాంటి సమయంలో నాన్ వెజ్ అయినా వెజ్ అయినా బయట తినడం కన్నా.. ఇంటిలో వండుకొని తినడమే మంచిదని చెబుతున్నారు. కోడిగుడ్డును కూడా కొందరు ఆరోగ్యం కోసం పచ్చిగా తింటుంటారు. అయితే ఫ్లూ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కోడి గుడ్లను కూడా బాగా ఉడకబెట్టి తింటే మంచిదని సూచిస్తున్నారు ఇక, చికెన్, కోడిగుడ్లు వండేటప్పుడు చేతుల్ని 20 నుంచి 30 నిమిషాలు ముందు శుభ్రంగా కడుక్కుంటే మంచిది. కొందరు మాత్రం చికెన్ పేరు చెబితే బర్డ్ ప్లూ గుర్తొచ్చి భయపడిపోతున్నారు. దీంతో భారీగా చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అమ్మకాలు కూడా పడిపోయాయి.





Untitled Document
Advertisements