కరోనా మహమ్మారి కారణంగా మూతబడిన స్కూల్ ల పునఃప్రారంభం పై స్పష్టతనిచ్చిన తెలంగాణ సర్కార్. గత సంవత్సరం మార్చ్ లో మూతబడిన బడులను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మంత్రులు, కలెక్టర్లతో బేటి అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ ఫిబ్రవరి నుంచి పాటశాలలు తిరిగి ప్రారంభించవలసిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఫిబ్రవరి 1 తారీకు నుండి 1 నుండి 8 తరగతులు మినహా 9వ తరగతి నుండి ఆపై తరగతులకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ స్కూల్లు నిర్వహించాలని సూచించారు. 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఎదావిధిగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సిఎం స్పష్టతనిచ్చారు.