కొత్త ఏడాదిలో అదిరిపోయే రాబడి కావాలా? అయితే మీరు ఇక్కడ డబ్బులు పెట్టొచ్చు!!

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 12:25 PM

కొత్త ఏడాదిలో  అదిరిపోయే రాబడి కావాలా?
అయితే మీరు ఇక్కడ డబ్బులు పెట్టొచ్చు!!

2020 అంతా కరోనా వైరస్. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలు అన్నీ కరోనా వైరస్ కోరల్లో చిక్కి సతమతమయ్యాయి. ఇప్పటికీ కూడా కోవిడ్ 19 ప్రభావం తగ్గలేదు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నయం అని చెప్పుకోవచ్చు. మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయి.
అందువల్ల ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి 2021 మంచి ఏడాది అని చెప్పుకోవచ్చు. స్టాక్ బ్రోకింగ్ సంస్థ జీసీఎల్ సెక్యూరిటీస్ ప్రకారం.. పలు ప్రభుత్వ స్కీమ్స్ వల్ల మార్కెట్‌లో లిక్విడిటీ ప్రారంభమైంది. 2021లో ఈక్విటీ, గోల్డ్, ప్రాపర్టీలలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చని జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ రవి సింఘాల్ తెలిపారు.

ఐటీ కంపెనీల స్టాక్స్‌లో డబ్బులు పెట్టడం మంచిదని ఈయన సూచించారు. కోవిడ్ 19 నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ వల్ల కంపెనీల ఖర్చులు తగ్గుతాయని, దీంతో వాటా ఆదాయం పెరగొచ్చని అందువల్ల మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశముందని వివరించారు. అందువల్ల ఐటీ షేర్లు కొనొచ్చని తెలిపారు.

బంగారం ధర 2020లో పరుగులు పెట్టింది. 27 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది కూడా పసిడి ధర పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. చాలా మంది నిపుణులు బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చని సిఫార్సు చేస్తున్నారు. అందువల్ల మీరు కూడా బంగారంలో డబ్బులు పెట్టొచ్చు.
స్టాక్స్, గోల్డ్ మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్‌లో డబ్బులు పెట్టినా కూడా మంచి రాబడి పొందొచ్చు. దీర్ఘకాలం లక్ష్యంతో టైర్ 2, టైర్ 3 ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంతో మంచి రాబడి పొందొచ్చు. అందువల్ల మీకు నచ్చిన ఆప్షన్‌ ఎంచుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.





Untitled Document
Advertisements