ఫ్లిప్‌కార్ట్‌లో కార్నివాల్ సేల్....మొబైల్స్‌పై భారీ తగ్గింపు

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:06 PM

ఫ్లిప్‌కార్ట్‌లో కార్నివాల్ సేల్....మొబైల్స్‌పై భారీ తగ్గింపు

ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్ ప్రారంభం అయింది. మార్చి 12వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. ఇందులో డీల్స్, డిస్కౌంట్లతో స్మార్ట్ ఫోన్లను అందించారు. ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్, రియల్ మీ సీ12, పోకో సీ3, రియల్ మీ నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్లపై ధర తగ్గింపును అందించారు. ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ కోసం యాక్సిస్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, మొబైల్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఐఫోన్ ఎస్ఈ(2020)ని ఈ నెలలో రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రారంభ మోడల్ అయిన 64 జీబీ ధర కాగా, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. అలాగే ఐఫోన్ ఎక్స్ఆర్ ధర రూ.38,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.43,999 ధరతో లిస్ట్ అయింది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ధర కూడా రూ.5,000 తగ్గింది. ఇప్పుడు దీని ధర రూ.44,999 నుంచి ప్రారంభం కానుంది. దీంతోపాటు మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ.7,000 అదనపు తగ్గింపు లభించనుంది. రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్‌పై కూడా రూ.2,000 తగ్గింపు అందించనున్నారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.14,999 నుంచి మొదలవనుంది.


మోటో జీ 5జీని ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఐకూ 3పై కూడా తగ్గింపు అందించారు. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.24,990కే అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా నెలకు రూ.4,998 మాత్రమే చెల్లిస్తూ ఈ ఫోన్ కొనవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41పై కూడా ధర తగ్గింపును అందించారు. ఈ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.1,500 తగ్గింపును అందించనున్నారు. ఇందులో 64 జీబీ వేరియంట్‌ను రూ.15,999కు, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.16,499కు కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ సీ12 కూడా రూ.500 తగ్గింపుతో రూ.8,499కే అందుబాటులో ఉంది.





Untitled Document
Advertisements