"కరోనా కంటే 'దెయ్యం' సినిమాకే ఎక్కువ భయపడతారు"

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 02:15 PM


రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ నటీనటులుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌జీవీ దెయ్యం’. నట్టిస్ ఎంటర్‌టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి పతాకాలపై జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఏప్రిల్ 16న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ 5 భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ .. ‘దెయ్యం సినిమా ఇంతకాలం ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే నేను జీవిత ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు రాజశేఖర్ వేరే సినిమాలో బిజీగా వున్నారు. తిరిగి ఆయన నా దగ్గరకి వచ్చేసరికి నేను ముంబైలో వేరే సినిమాలో బిజీగా వున్నా. ఇద్దరం వేరే వేరే చిత్రాలతో బిజీ ఉన్నందున ఈ సినిమా ఆలస్యమైంది. ఈ చిత్రంలో స్వాతి రాజశేఖర్ కూతురు పాత్రలో అద్భుతంగా నటించింది’ అని అన్నారు.

అనంతరం హీరోయిన్ స్వాతి మాట్లాడుతూ.. ‘నేను ఈ మూవీ కోసం చాలా కాలం నుండి ఎదురు చూశాను. సినిమా పోస్ట్‌పోన్ కావడం కాస్త నిరాశపరిచినప్పటికీ.. ఇప్పుడు విడుదల అవుతున్నందుకు చాలా అనందంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ తప్పక నచ్చుతుందని బావిస్తున్నాను. మా సినిమా చూశాక కరోనాకు భయపడటం మానేసి మా దెయ్యనికి భయపడతారు’ అని చెప్పింది.

నిర్మాత జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఇంత కాలానికి మా "దెయ్యం" మూవీ కి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాను. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మా దెయ్యం సినిమా చూడాలని కోరుతున్నాను’ అని అనగా మరో నిర్మాత.. నట్టి కుమార్ మాట్లాడుతూ.. ‘దెయ్యం సినిమా కంటెంట్ చాలా బాగుంది. తప్పకుండా హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. 16 వ తేదీన మా సినిమా సోలోగా వస్తుంది. మీరందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని కోరుతున్నాను’ అని అన్నారు.





Untitled Document
Advertisements