న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఇక నూతన సంవత్సరంలో కార్ల కొనుగోలుదారులకు విక్రయ సమస్య ఎదురయ్యేలా ఉంది. ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోక్స్ వ్యాగన్, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఫోర్డ్, టయోటా, హోండా , స్కోడా కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఇప్పుడు ఇదే జాబితాలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ రైనో చేరింది. ' ఉత్పత్తి వ్యయం, ముడిసరకు ధరలు పెరగడంతో క్విడ్, డస్టర్, లాజ్ ధరలను పెంచుతున్నామని' కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.