ఎయిర్‌టెల్ తీపికబురు...ఆ లిమిట్ పెంపు!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 01:54 PM

ఎయిర్‌టెల్ తీపికబురు...ఆ లిమిట్ పెంపు!

దేశీ దిగ్గజ టెలికం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్‌కు చెందిన పేమెంట్స్ బ్యాంక్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అకౌంట్ బ్యాలెన్స్ లిమిట్‌ను రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి పేమెంట్స్ బ్యాంక్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది.

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇటీవలనే పేమెంట్స్ బ్యాంక్‌ అకౌంట్ బ్యాలెన్స్ పరిమితిని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్ ఇప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ లిమిట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


దీని వల్ల ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు వారి అకౌంట్‌లో రూ.2 లక్షల వరకు డబ్బులను కలిగి ఉండొచ్చు. ఇది వరకు ఈ పరిమితి రూ.లక్ష వరకే ఉండేది. బ్యాలెన్స్ లిమిట్ పెంచడం ద్వారా పేమెంట్స్ బ్యాంక్ వినియోగం కూడా పెరగొచ్చని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అభిప్రాయపడింది.

ఇకపోతే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 2017లో ప్రారంభమైంది. భారతీ ఎయిర్‌టెల్ ఈ బ్యాంక్‌ను స్థాపించింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కస్టమర్లు బ్యాంక్ ఖాతా తెరవొచ్చు. రూ.లక్ష వరకు ఉచిత ప్రమాద బీమా పొందొచ్చు. ఇంకా అకౌంట్‌లోని డబ్బులకు 3 శాతం వడ్డీ వస్తుంది. ఆన్‌లైన్ డెబిట్ కార్డు పొందొచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్, క్యాష్ విత్‌డ్రా సేవలు కూడా లభిస్తాయి. ఇంకా బిల్లులు కూడా చెల్లించొచ్చు.





Untitled Document
Advertisements