కరోనా లక్షణాలుంటే ఈ మందులు వాడండి...టెస్టులు తరువాత

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 05:53 PM

కరోనా లక్షణాలుంటే ఈ మందులు వాడండి...టెస్టులు తరువాత

కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉంటే.. ముందు చికిత్స తీసుకోవాలని సూచించింది. టెస్టుల గురించి వేచి చూడకుండా విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని తెలిపింది. ఈ మేరకు కొన్ని మందులు ఎలా వేసుకోవాలో సూచించింది. ప్రభుత్వం సూచించినట్లుగా వాటిని వేసుకుంటే స్వల్ప, మధ్యస్థ స్థాయిలో ఉంటే కరోనాను ఎదుర్కోవచ్చని స్పష్టం చేసింది.
కరోనా లక్షణాలు ఉన్నప్పుడు వాడాల్సిన మందులు:
* డాక్సిసైక్లిన్ (Doxycycline) అనే యాంటీ బయోటిక్/యాంటీ వైరల్ మందును ఉదయం, రాత్రి 5 రోజుల పాటు వేసుకోవాలి.
* పారాసిటమాల్ (Paracetamol) అనే బిళ్లను జ్వరం ఉంటే ఉదయం, రాత్రి 10 రోజుల పాటు తీసుకోండి.
* లెవోసిట్రజిన్ (Levocetirizine) అనే మెడిసిన్‌ను జలుబు లక్షణాలు ఉంటే లెవో సిట్రజిన్ మందులను ఉదయం వేళలో 10 రోజుల పాటు వేసుకోవాలి.
* రాంటాక్ (Rantack) మందు కడుపు ఉబ్బరంగా ఉండి త్రేన్పులు ఎక్కువగా వస్తే రాంటాక్ టాబ్లెట్స్‌ ప్రతి రోజు ఉదయం 10 రోజుల పాటు తీసుకోవాలి.
* శరీరంలో రోగనిరోధ శక్తి పెంచుకునేందుకు 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం విటమిన్ సీ టాబ్లెట్లను చప్పరించాలి.
* మల్టీ విటమిన్ టాబ్లెట్స్‌ను కూడా ఉదయం, రాత్రి 10 రోజుల పాటు వేసుకుంటే మంచిది.
* మిథైల్ ప్రెడ్నిసోలోన్ (Methylprednisolone) అనే మందును ఒక వేళ ఐదు రోజులైనా జ్వరం తగ్గకపోతే ఉదయం రాత్రి 5 రోజుల పాటు వేసుకోవాలి.
* విటమిన్ డీ టాబ్లెట్స్‌ను ఉదయం పూట ఒకసారి 10 రోజుల పాటు తీసుకోవాలి.

ఒకవేళ శ్వాస ఆడడంతో ఇబ్బందులు వస్తే కాల్‌ సెంటర్‌కు 104కి కాల్ చేసి సాయం పొందాలి. లేదా దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాలి.





Untitled Document
Advertisements