మొట్టమొదటి 12 మంది గొప్ప ఆళ్వారులను నమ్మాళ్వారులంటారు. శైవభక్తుల్ని నాయనార్లని వైష్ణవ భక్తుల్ని ఆళ్వారులని అంటారు. వైష్ణవ మతం ప్రకారం ఈ 12 మంది ఆళ్వారులు ఆదిశేష గరుడల అంశలని వారు విష్ణువు సుదర్శన చక్రాన్ని, శంఖాన్ని అనుసరిస్తారని చెప్పబడింది. అపర విష్ణు భక్తులైన వీరు కలియుగంలో ద్రావిడ ప్రాంతంలోని తామ్రపర్ణి, కృతమాల, పాపనాశిని, కావేరి ఈ నదుల యొక్క తీరాలలో ఏ కులంలో అయినా వీరు జన్మిస్తారు.