తొలి రాత్రి కాళరాత్రి... స్నేహితులుగా ఉందామన్న భర్త

     Written by : smtv Desk | Tue, Jul 27, 2021, 11:33 AM

తొలి రాత్రి  కాళరాత్రి... స్నేహితులుగా ఉందామన్న భర్త

కోటి ఆశలతో తొలిరేయి భర్త గదిలోకి ప్రవేశించిన ఆమెకు అది కాళరాత్రి అయింది. భర్త విచిత్ర ప్రవర్తనతో విస్తుపోయింది. అంతేకాదు, అతడికి మానసిక సమస్యలతోపాటు మరెన్నో అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిసి విస్తుపోయింది. తన జీవితాన్ని నాశనం చేసిన అత్తింటి కుటుంబంపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తాడేపల్లిలో పనిచేస్తున్న ఓ మహిళ తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మించి గుంటూరుకు చెందిన యువతితో సంబంధం కుదుర్చుకుంది. మే 26న వివాహం జరిగింది. ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు రూ. 6 లక్షల కట్నం సమర్పించుకున్నారు.

తొలి రోజు భర్త గదిలోకి ప్రవేశించిన ఆమె.. అతడి ప్రవర్తనకు భయపడింది. వింతగా ప్రవర్తిస్తూ, విచిత్ర ధోరణితో ఆమెను విస్తుపోయేలా చేశాడు. ఈ వయసులో కోరికలు ఉండకూడదని ఆమెకు హితవు పలికి నిద్రపోయాడు. ఆ తర్వాతి రెండు రోజులు కూడా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె నిలదీస్తే.. భార్యాభర్తలు అంటే శారీరక సంబంధం కాదని, మంచి స్నేహితులుగా ఉందామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె నిర్ఘాంతపోయింది.

ఈ రోజు తాను వేసుకోవాల్సిన మాత్రలు అయిపోయాయని, అవి వేసుకోకుంటే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందని, తన ఆరోగ్యం బాగాలేదని, మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పడంతో యువతి షాక్‌కు గురైంది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అత్తింటివారిని నిలదీశారు.





Untitled Document
Advertisements