శకుని ఇతడు దుర్యుధనుని మేనమామ. గాంధారరాజు సుబలుని పుత్రుడు. గాంధారికి సోదరుడు. ఇతడు చాలా దుర్మార్గుడు. వృషకుడు, అచలుడు ఇతని సోదరులు. ఇతని కుమారుడు ఉలూకుడు. శకుని హస్తినాపురంలో వుంటూ దుర్యోధనుని దుర్మార్గపు చేష్టలకు వంతపాడుతూ పాండవులను అడవులకు పంపడంలో, ద్రౌపది వస్త్రాపహరణంలో చివరికి సంధి విఫలమై మహాభారత సంగ్రామం జరగడంలో శకుని కుయుక్తులే ముఖ్యమైనవి. ఇతని పాత్ర ముఖ్యమైనది. శకుని దుర్యోధనుని మీద ఉన్న క్రోధముతో మహాభారత యుద్దమునకు పెరకుడు అయి చివరకు యుద్దంలో సహదేవుని చేతిలో ఇతడు మరణిస్తాడు. గాంధారపతి, గాంధార రాజు, గాంధార రాజపుత్ర, గాంధార రాజకసుత,కితన, పార్వతీయ, సౌబల, సాబలక, సుబలజ, సుబలపుత్ర అనేవి శకునికి గల పేర్లు.