కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై తీవ్రమైన నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మరోవైపు ఈ పథకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల క్రమశిక్షణ, నైపుణ్యాల వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని చెప్పారు.వారికే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు .