య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ దాఖ‌లు...కేటీఆర్ హాజ‌రు

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 02:32 PM

య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ దాఖ‌లు...కేటీఆర్ హాజ‌రు

భార‌త రాష్ట్రప‌తి ఎన్నికల్లో సోమ‌వారం మ‌రో కీల‌క ఘ‌ట్టం చోటుచేసుకుంది.రాష్ట్రపతి పదవికి అధికార పక్షం నుండి ద్రౌపది ముర్ము పోటిపడుతుండగా విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో విప‌క్షాలకు చెందిన ప‌లువురు నేత‌లు వెంట రాగా.. సిన్హా రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు.ఈ కార్య‌క్రమానికి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు. ఇక సిన్హాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌ర‌ఫున ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు.





Untitled Document
Advertisements