డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అమాయకులైన ప్రజలు బలి అవుతారు. హైదరాబాద్ సనత్ నగర్ లో ఇలాంటి సంగటన ఇక్కడ చోటు చేసుకుంది . జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించారు కొంతమంది యువకులు. ఓవర్ స్పీడ్ తో కారు నడిపిన నిందితులు..ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లారు.
తీవ్రంగా గాయపడిన చిన్నారి స్పాట్ లోనే చనిపోయింది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారుని గుర్తించిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.