వెలింగ్టన్, జనవరి 20: పాక్తో ఐదు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. చివరి వన్డేలో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన కివీస్..5-0తో సిరీస్ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్... 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (100; 126 బంతుల్లో 10×4, 1×6) సెంచరీ చేయగా.. రాస్ టేలర్ (59; 73 బంతుల్లో 3×4) కూడా రాణించాడు. టేలర్, గప్తిల్ మూడో వికెట్కు 112 పరుగులు జోడించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపారు. కానీ తర్వాత పాక్ బౌలర్లు పుంజుకొని 12 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు తీసి కివీస్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. పాక్ బౌలర్లలో రాయిస్ (3/67), అష్రఫ్ (2/49) సత్తా చాటారు. ఛేదనలో పాక్ను హెన్రీ (4/53) దెబ్బ తీశాడు. ఆ జట్టు 49 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. హారిస్ సొహైల్ (63; 87 బంతుల్లో 5×4), షాదాబ్ఖాన్ (54; 77 బంతుల్లో 5×4) రాణించినా.. మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో పాక్ ఓటమి పాలైంది.