లారీ, జీపు ఢీకొని 8 మంది మృతి..

     Written by : smtv Desk | Sun, Jan 21, 2018, 03:22 PM

లారీ, జీపు ఢీకొని 8 మంది మృతి..

రాంచి, జనవరి 21 : లారీ, జీపు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో చోటు చేసుకుంది. వీరంతా ఎస్ఎస్సీ పరీక్ష రాసేందుకు దుమ్కా నుండి డియోగారిన్‌ వెళ్తు౦డగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.





Untitled Document
Advertisements