అలనాటి మేటి నటి కృష్ణకుమారి ఇక లేరు...

     Written by : smtv Desk | Wed, Jan 24, 2018, 01:51 PM

అలనాటి మేటి నటి కృష్ణకుమారి ఇక లేరు...

బెంగళూరు, జనవరి 24 : అలనాటి అందాల నటి కృష్ణకుమారి(83) అనారోగ్యంతో కన్నుమూశారు. నైహతిలో 1993 మార్చి 03 వ తేదీన జన్మించిన కృష్ణకుమారి.."నవ్వితే నవరత్నాలు" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె 'పల్లె పడుచు', 'బంగారు పాప', 'ప్రియురాలు', 'పిచ్చి పుల్లయ్య', 'ఆశాజీవులు', 'పునర్జన్మ' వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి అగ్ర నటులతో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషలలో నటించారు. కాగా గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈమె బెంగుళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.





Untitled Document
Advertisements