న్యూఢిల్లీ, జనవరి 26 : ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించి తన శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్తున్న లక్ష్యపెట్టక భద్రతా దళాలకు విజయాన్ని అందించిన ఓ కమాండో కార్పొరల్ జ్యోతిప్రకాశ్ నిరాలా కు దేశంలోనే అత్యున్నత సేవా పతకమైన అశోకచక్ర లభించింది. బిహార్ రోహ్తాస్ జిల్లాలోని బడ్లాది అతని స్వగ్రామం. ఇతను కశ్మీర్ లో బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే అశోక చక్రను సాధించడం విశేషం.
రాజ్పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో.. అత్యున్నత ఆర్మీ అవార్డును రాష్ట్రపతి అందజేయగా.. నిరాలా తల్లి మాలతీదేవి, భార్య సుష్మనంద్లు స్వీకరించారు. కాగా సుహాస్ బిశ్వాస్, వ్యోమగామి రాకేశ్ శర్మ తర్వాత వాయుసేనలో పతకాన్ని అందించిన ఘనత నిరాలానే కావడం గమనార్హం.